అక్షరటుడే, వెబ్డెస్క్: IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ(IAS Transfers) అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి(CS Santhi kumari) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్(IAS Transfers) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
IAS Transfers | బదిలీ అయిన ఐఏఎస్లు వీరే..
శశాంక్ గోయల్(Shashank Goyal) సీజీజీ వైస్ ఛైర్మన్గా, జయేశ్ రంజన్(Jayesh Ranjan) పరిశ్రమల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ, పెట్టుబడుల సెల్ సీఎంవోగా బదిలీ అయ్యారు. సంజయ్ కుమార్(Sanjay Kumar) పరిశ్రమల శాఖ ఛీఫ్ సెక్రెటరీగా, దాన కిశోర్(Dana Kishore) ప్రిన్సిపల్ సెక్రెటరీ టు ఎల్ఈటీఅండ్ఎఫ్గా, స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. శ్రీదేవి(Sridevi) మున్సిపల్ శాఖ సెక్రెటరీ, ఇలంబర్తి(ఇలంబర్తి) హెచ్ఎండీఏ సెక్రెటరీగా, ఆర్వీ కర్ణణ్(RV Karnan) జీహెచ్ఎంసీ కమిషనర్, కె.శశాంక(K.Shashanka) ఫ్యూచసిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్, మైన్స్ డైరెక్టర్గా నియామకమయ్యారు. హరీశ్ జెన్కో సీఎండీగా, ఐఅండ్పీఆర్ ఇన్ఛార్జి, కె.నిఖిల హ్యుమన్ రైట్స్ కమిషన్ సెక్రెటరీగా, సంగీత సత్యనారాయణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ అండ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా, ఎస్.వెంకట రావు ఎండోమెంట్ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా వ్యవహరించనున్నారు.
పి.కాత్యాయని దేవి అడిషనల్ సీఈవో సెర్ప్, ఈవీ నర్సింహారెడ్డి అడిషనల్ సీఈవో ఇండ్రస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్, మూసీ రివర్ ఎండీగా బదిలీ అయ్యారు. హేమంత్ సహదేవ్ రావు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా, ఫణీంద్ర రెడ్డి టీజీఎంఎస్ఐడీసీ ఎండీ, కదిరవణ్ పంచాయతీ రాజ్ రూరల్ డెవలెప్మెంట్ జాయింట్ కమిషనర్, కె.విద్యాసాగర్ (నాన్ క్యాడర్ ఐఏఎస్) హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్), ఉపేందర్ రెడ్డి(నాన్ క్యాడర్ ఐఏఎస్) హెచ్ఎండీఏ సెక్రెటరీగా ట్రాన్స్ఫర్ అయ్యారు.