అక్షరటుడే, వెబ్డెస్క్: Ahmadabad Plane clash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. లండన్(London) వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో విమానంలోని వారితో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు(Medical college students) సహా మొత్తం 265 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తమ వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రికి(Ahmedabad Civil Hospital) వచ్చారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో రోదనలు మిన్నంటాయి. ఎవరిని కదలించినా తమ వారిని కోల్పోయామని ఏడుస్తూ చెబుతున్నారు. ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయిన ఓ మహిళ తన తండ్రి ఏం తప్పు చేశాడని వాపోయింది. విమానంలో కూర్చోవడమే ఆయన చేసినా తప్పా అని ప్రశ్నించింది.
ఫాల్గూని అనే మహిళా మాట్లాడుతూ.. ‘‘మృతులకు కుటుంబాలకు ఎయిర్ ఇండియా(Air India) రూ. కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. ఎవరికి కావాలి రూ.కోటి ? నేను రూ.2 కోట్లు ఇస్తా.. పోయిన మా తండ్రి ప్రాణాన్ని తిరిగి ఇచ్చేయండి.. మీ వల్లే మా నాన్న దూరం అయ్యాడు.” అని వాపోయింది. విమానాన్ని ముందే చెక్ చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ఆమె అన్నారు. అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాగా డీఎన్ఏ నమూనాలు(DNA Samples) ఇచ్చిన ఆమె తన తండ్రి మృతదేహం కోసం ఆస్పత్రిలో నిరీక్షిస్తోంది.