అక్షరటుడే, వెబ్డెస్క్ : Jaggareddy | కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (TPCC Working President) జగ్గారెడ్డి(Jagga reddy)కి పార్టీ అడ్వైజరి కమిటీలో చోటు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డిఫరెంట్ అని అడ్వైజరీ కమిటీలో వేశారన్నారు. తనకు గాంధీ భవన్ (Gandhi Bhavan)లో అటెండర్ పోస్టు ఇచ్చిన హ్యాపీగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
ఇందిరాగాంధీ (Indira Gandhi) గురించి మాట్లాడే అర్హత బీజేపీ(BJP)కి లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గురించి ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు (MP Raghunandan Rao) రాహుల్గాంధీపై పరిధి దాటి మాట్లాడారన్నారు. తాను కూడా ప్రధాని మోదీపై మాట్లాడగలనని, కానీ తనకు విజ్ఞత ఉందన్నారు.