అక్షరటుడే, వెబ్డెస్క్ :Hydraa | చెరువు ఎఫ్టీఎల్(FTL) పరిధిలో నిర్మించిన పలు భవనాలను హైడ్రా అధికారులు(Hydra officers) గురువారం ఉదయం కూల్చి వేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్(Alwal)లోని చిన్నారి కుంటలో నిర్మించిన మూడు భవనాలను జేసీబీలతో నేలమట్టం చేశారు.
చిన్నారి కుంటలోని ఎఫ్టీఎల్ ప్రాంతంలో భవనాలు నిర్మించారని స్థానికులు హైడ్రా(Hydraa)కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువులోకి నీరు వెళ్లకుండా తమ కాలనీలు జలమయం అవుతున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం యంత్రాల సాయంతో అక్కడకు చేరుకొని భవనాలను కూల్చి వేశారు. ఈ క్రమంలో భవన యజమానులకు, హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులను(Police) మోహరించి భవనాలను నేలమట్టం చేశారు.