అక్షరటుడే, వెబ్డెస్క్: Jammu Kashmir | ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు(Security Forces) అప్రమత్తం అయ్యాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల(Terrorists) కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్ గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్(Search Operation) కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్కౌంటర్లో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ ప్రాంతో మరో 8 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గాలిస్తున్నారు.