అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC | రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ(GHMC)కి భారీగా నిధులు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,654 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా అందులో సగం నిధులు విడుదల చేసింది.
రూ.1,327 కోట్లను జీహెచ్ఎంసీ పీడీ అకౌంట్లో జమ చేసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడంతో పలు అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ ఈ నిధులు వినియోగించనుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో హైదరాబాద్(Hyderabad city)లో వరద ముంపు పొంచి ఉంటుంది. ఈ క్రమంలో రోడ్ల అభివృద్ధి, నాలాల మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.