అక్షరటుడే, వెబ్డెస్క్: DNA Test | అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash)లో 265 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. లండన్ వెళ్తున్న విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనాన్ని ఢీకొని పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు బీజే మెడికల్ కాలేజీ విద్యార్థులు 24 మంది చనిపోయారు. అయితే విమానం పేలిపోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనట్లుగా మారాయి. దీంతో అధికారులు డీఎన్ఏ పరీక్ష (DNA Test) చేశాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ మేరకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. మృతుల గుర్తింపులో కీలకంగా మారిన డీఎన్ఏ టెస్ట్ అంటే ఏమిటి.. ఎలా చేస్తారో తెలుసుకుందాం..
DNA Test | డీఎన్ఏ పరీక్ష అంటే..
డియోక్సిరి బోన్యూక్లిక్ యాసిడ్ (DNA) తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. డీఎన్ఏ పరీక్షలు ఏదైనా జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడానికి, చట్టపరమైన ప్రయోజనాల కోసం పితృత్వాన్ని నిరూపించడానికి చేస్తారు. అలాగే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు అప్పగించడానికి కూడా డీఎన్ఏ పరీక్ష చేస్తారు. డీఎన్ఏ అంటే తల్లిదండ్రులిద్దరి నుంచి వారి పిల్లలకు సమాచారాన్ని చేరవేసే జన్యు సంకేతం.
DNA Test | డీఎన్ఏ పరీక్ష ఎప్పుడు చేస్తారు
డీఎన్ఏ పరీక్ష (DNA Test) ఉద్దేశ్యం వ్యక్తులకు వారి జన్యు నిర్మాణం గురించి సమాచారాన్ని అందించడం. ఈ సమాచారాన్ని వంశపారంపర్యతను నిర్ణయించడం, ఆరోగ్య ప్రమాదాలు, సంభావ్య కుటుంబ సభ్యులను గుర్తించడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. డీఎన్ఏ పరీక్షలను సీక్వెన్సింగ్, మైక్రోఅరే విశ్లేషణ, PCR వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి చేస్తారు.
DNA Test | ఎలా చేస్తారు
సాధారణంగా ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ సేకరిస్తారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరిస్తారు. ఇలా ఎవరి డీఎన్ఏ అయితే సరిపోతాయో వారికి మృతదేహాలు అప్పగిస్తారు. పెద్ద మొత్తంలో ప్రజలు చనిపోయి, మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారినప్పుడు అధికారులు డీఎన్ఏ పరీక్ష ద్వారా వారిని గుర్తిస్తారు. డీఎన్ఏ నమూనా(DNA sample) సేకరించిన తర్వాత, దాని జన్యు నిర్మాణాన్ని నిర్ణయించడానికి దానిని విశ్లేషిస్తారు.