అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Updates | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మే నెలలో భారీ వర్షాలు పడడంతో వానాకాలాన్ని తలపించింది. అయితే నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ముందుగానే రావడంతో జూన్లో వర్షాలు దంచి కొడుతాయని ప్రజలు భావించారు. అయితే జూన్ ప్రారంభం నుంచి వరుణుడు ముఖం చాటేశాడు. అక్కడక్కడా అడపాదడపా వానలు తప్పితే భారీ వర్షాలు పడడం లేదు. దీనికి తోడు ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోత(Steaming)తో ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో శనివారం సైతం అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) హెచ్చరించారు. 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తేమతో కూడిన వాతావరణంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad)లో 37-38 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందన్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది.