అక్షరటుడే ఇందూరు: Mla Dhanpal Suryanarayana | హిందూ సమాజం సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ముందుకెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
నగరంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయం (Umamaheswara Swamy Temple) సిల్వర్ జూబ్లీ వేడుకలకు (Silver Jubilee celebrations) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని, ఆలయాల పునర్నిర్మాణానికి పాటుపడాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ (Chairman of the Market Committee muppa Ganga Reddy) ముప్ప గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, ధన్పాల్ దత్తాద్రి, మాస్టర్ శంకర్, లాభిశెట్టి శ్రీనివాస్, రామస్వరూప్ దాలియా, కమల్ ఇనాని తదితరులు పాల్గొన్నారు.