అక్షరటుడే, వెబ్డెస్క్: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. అక్కడ రుతుపవనాలు ప్రవేశించిన వారం రోజుల్లో (జూన్ 20 నుంచి 27 వరకు) 31 మంది చనిపోయారు. నలుగురు వరదల్లో తప్పిపోయారు, కొండచరియలు విరిగిపడి 66 మంది గాయపడ్డారు.
భారీ వర్షాల (heavy rains) వల్ల హిమాచల్ రాష్ట్రంలో వారం రోజుల్లో రూ.29.16 కోట్ల నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆరు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఏడు దుకాణాలు, ఎనిమిది గోశాలలు (cowsheds) నీటిలో కొట్టుకుపోయాయి.
Himachal : రాష్ట్ర వ్యాప్తంగా..
ట్రాఫిక్ సమస్యతో హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 53 రోడ్లు మూసివేశారు. 135 విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, 147 తాగునీటి పథకాలు నిలిచిపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
హిమాచల్లో అత్యధికంగా కులు జిల్లాలో నష్టం జరిగింది. ఈ జిల్లాలో 23 రోడ్లు మూసివేశారు. మండి జిల్లా(Mandi district)లో 59 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కిన్నౌర్లో 33 తాగునీటి పథకాలు (drinking water schemes) పనిచేయడం లేదు. జులై 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో సిర్మౌర్ Sirmaur, సిమ్లా Shimla జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నదులు, కాలువలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది.