అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో Telangana-Chhattisgarh border ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్ట karre guttaluను కేంద్ర బలగాలు central forces తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ గుట్టల్లో మావోయిస్టులు moaists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు మూడు రోజులుగా కూంబింగ్ coombing నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్ Chhattisgarh, కేంద్ర బలగాలు ఇంకా సెర్చ్ ఆపరేషన్ను search operation కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవులను జల్లెడపడుతున్నాయి. బీజాపూర్ bijapur జిల్లా పూజారి కాంకేడ్ మీదుగా చొచ్చుకెళ్తూ.. హిడ్మా hidmaను టార్గెట్ చేస్తూ భద్రత బలగాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్పై పట్టు కోల్పోతున్నారు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో బలహీనపడ్డ మావోయిస్టులు ఆ ఆపరేషన్తో కుదేలు అయ్యే అవకాశం ఉంది.
ఈ ఆపరేషన్తో రాష్ట్ర పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి IG Chandra Shekar Reddy తెలిపారు. గురువారం పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రెగుట్ట ఆపరేషన్లో కేంద్ర బలగాలే పాల్గొంటున్నాయని, దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వివరించారు.