అక్షరటుడే, వెబ్డెస్క్ : Mulugu | ములుగు Mulugu జిల్లా వెంకటాపూరం venkatapuram సమీపంలోని కర్రెగుట్టల karreguttalu వద్ద హైటెన్షన్ నెలకొంది. ఈ గుట్టల్లో భారీగా మావోయిస్టులు maoists ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు చుట్టు ముట్టాయి.
ఛత్తీస్గఢ్ Chhattisgarh, తెలంగాణ Telangana వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ joint operation చేపట్టారు. రెండు రాష్ట్రాల నుంచి కర్రెగుట్టల వైపు భారీగా సీఆర్పీఎఫ్ crpf బలగాలు చేరుకున్నాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
కాగా.. కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు మావోయిస్టుల గతంలో లేఖ విడుదల చేశారు. గిరిజనులు ఎవరు అటవీ ప్రాంతంలోకి రావొద్దని, పోలీసుల మాటలు విని తమ సమాచారం ఇవ్వొద్దని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో బచావో కర్రెగుట్టలు save karre guttalu పేరుతో భద్రతా బలగాల ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా దళం Hidma dalam ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సాయుధ బలగాలు గుట్టలను జల్లెడ పడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి కూంబింగ్ coombing కొనసాగుతోంది.