అక్షరటుడే, వెబ్డెస్క్: Engineering Colleges | రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు(High Court) షాక్ ఇచ్చింది. ఫీజుల పెంచాలన్న కళాశాలల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు (Private Medical Colleges) ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే మాత్రం కాలేజీల పిటిషన్ను తోసిపుచ్చింది. ఆరు వారాలలోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి ఆదేశించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
Engineering Colleges | తల్లిదండ్రులకు ఊరట
ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. కాలేజీల స్థాయిని బట్టి ఫీజులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ (Government Fee Reimbursement) రూపంలో రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీలు, పది వేలలోపు ర్యాంకు వచ్చిన వారికి, ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదివిన వారికి మాత్రం మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఫీజులు అధికంగా ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఫీజుల పెంపునకు కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు ఊరట లభించింది. గతంలో 2022లో ప్రైవేట్ కాలేజీలు ఫీజులు పెంచాయి. తాజాగా మళ్లీ పెంచాలని చూడగా.. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్కు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయింది. జులై 13న తొలి విడత సీట్లు కేటాయించనున్నారు.