అక్షరటుడే, వెబ్డెస్క్ : Group 1 Exams | గ్రూప్–1 పరీక్షలపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ(TGPSC) దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. గ్రూప్ -1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్(Single bench) ధర్మాసనం ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామకపత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.
వాదనలు విన్న న్యాయమూర్తులు(Judges) సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించారు. సింగిల్ బెంచ్లోనే తేల్చుకోవాలని సూచించింది. వేసవి సెలవులకు ముందే తుది తీర్పు ఇవ్వాలని సింగిల్ బెంచ్కు న్యాయస్థానం సూచించింది. మరోవైపు ఈ రోజే గ్రూప్–1(Group-1) పిటిషన్లపై సింగిల్బెంచ్లో సైతం విచారణ జరగనుంది.