అక్షరటుడే, న్యూఢిల్లీ: Covid-19 : సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని(world) అతలాకుతలం చేసిన కొవిడ్ 19 Covid cases మరోసారి విజృంభిస్తోంది.
ఆసియా(Asia)లోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singapore)లలో కరోనా వైరస్ మరణాలు వెలుగు చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే భారత్(India)లోనూ కొవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఒక్క వారం రోజుల్లోనే 164 కేసులు వెలుగు చూశాయి. కేరళ(Kerala)లో 69, మహారాష్ట్ర(Maharashtra)లో 44, తమిళనాడు(Tamil Nadu)లో 34 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా అనుమానిత కేసులను గుర్తించారు. వెంటనే వారిని ఐసోలేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. కేసుల తీవ్రత మరింత పెరిగితే.. మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి కానుంది.