అక్షరటుడే, వెబ్డెస్క్: Rain Alert | వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో వరుణుడు ముఖం చాటేశాడు. అక్కడక్కడ చిరు జల్లులు మినహా భారీ వర్షాలు పడడం లేదు. ఓ వైపు రైతులు(Farmers) వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో వర్షాలు పడకపోవడంతో వారు ఆందోళన చెందారు. వరినాట్లు వేయాలంటే భారీ వర్షాలు(Heavy Rains) పడితే గాని పనులు సాగవు. ఈ క్రమంలో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తన ధ్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆంధ్ర(Andhra), తెలంగాణ(Telangana)లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు కూడా విస్తరిస్తుండడంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.