Site icon aksharatoday.in

Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

Rythu Bharosa

Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rythu Bharosa | వానాకాలం సాగు సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం వేగంగా విడుదల చేస్తోంది. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. శుక్రవారం మరో రూ.905.89 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

ఐదు నుంచి ఏడు ఎకరాల్లోపు భూమి ఉన్న 2.64 లక్షల మందికి ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఐదు రోజుల్లో రూ.7310.59 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేసింది. 65.12 లక్షల మంది రైతులకు రైతు భరోసా జమ అయింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ప్రారంభం కాకముందే డబ్బులు పడుతుండటంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

Exit mobile version