అక్షరటుడే, నిజాంసాగర్:Nizamsagar | ఆరుబయట ఆటలతో చిన్నారులకు ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్(Mallappa Patel) అన్నారు. మంగళవారం పెద్దకొడప్గల్లోని కాటేపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ(Cricket tournament)ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చిన్నారులు, పెద్దలు ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారని, ఆరుబయట ఆటలాడితేనే(Outdoor Games) ఆరోగ్యమని పేర్కొన్నారు. ఆటల్లో ప్రతిభచూపి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తేవాలని సూచించారు. ఆయన వెంట సింగిల్ విండో వైస్ ఛైర్మన్ గోకన్ గంగాగౌడ్, నాయకులు ఇస్మాయిల్ పటేల్, ఆకుల రాంచందర్, అప్రోజ్ పటేల్, సోంపేట రాందాస్ తదితరులు ఉన్నారు.