అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట సోమవారం విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం హరీశ్రావు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ (KCR)తో భేటీ అయ్యారు. విచారణ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నల గురించి వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
కమిషన్ ఎదుట బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో కమిషన్ విచారణ తీరు తెన్నులను కేసీఆర్కు హరీశ్రావు వివరించినట్లు సమాచారం. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు ఎందుకు మార్చాల్సివచ్చిందో చెప్పాలని కాళేశ్వరం కమిషన్ పదేపదే అడిగిందని ఆయన తెలిపారు. వీరి సమావేశం దాదాపు రెండు గంటలుగా కొనసాగుతోంది. ఎల్లుండి కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.