అక్షరటుడే, వెబ్డెస్క్: Secunderabad | ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్ కోచ్(Gym coach) మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. రీసాల్బజార్(Risal Bazaar)లో నివాసం ఉండే జ్ఞానేశ్వర్ జిమ్ కోచ్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆదివారం సాయంత్రం బిర్యానీ తిన్నాడు. అనంతరం ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ క్లినిక్కు వెళ్లాడు. అయితే గ్యాస్ట్రిక్ సమస్య(Gastric problem) అని చెప్పి సదరు ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇచ్చి పంపించాడు.
క్లినిక్ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే జ్ఞానేశ్వర్ కుప్పకూలాడు. వెంటనే కంటోన్మెంట్ ఆస్పత్రికి (Cantonment Hospital) తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో క్లినిక్ వద్ద జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతోనే(RMP Negligence) మృతి చెందాడని ఆరోపించారు. ఈ మేరకు సదరు ఆర్ఎంపీని బొల్లారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.