అక్షరటుడే, వెబ్డెస్క్: Gurukul School | అద్దె చెల్లించలేదని గురుకుల పాఠశాల(Gurukul School)కు భవన యజమాని(Building owner) తాళం వేశాడు. వేసవి సెలవుల అనంతరం బడికి వెళ్లిన ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తాళం వేసి ఉండడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి(Bagh Lingampalli)లో చోటు చేసుకుంది.
బాగ్లింగంపల్లిలోని ఓ ప్రైవేటు భవనంలో బాలికల గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. అయితే 13 నెలలుగా అద్దె(Rent) బకాయిలు చెల్లించలేదు. దీంతో గురువారం పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా భవన యజమాని తాళం వేసుకొని వెళ్లాడు. దీంతో ఉపాధ్యాయులు(Teachers), విద్యార్థులు(students) పాఠశాల బయటే ఉండిపోయారు. సంబంధిత భవన యజమానితో అధికారులు మాట్లాడుతున్నట్లు సమాచారం.