అక్షరటుడే, కామారెడ్డి: Bhiknoor | వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ విద్యుత్షాక్తో ఓ అంటెడర్ మృతి చెందాడు. ఈ ఘటన భిక్కనూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలో (Social Welfare Gurukul School) సోమవారం చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. భిక్కనూరు సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహంలో అటెండర్ దోమకొండ లింగం(38), ఆరోజ్ కుమార్ అవుట్సోర్సింగ్ (Outsourcing) ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సోమవారం ఇద్దరు పాఠశాలలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి లింగం మృతి చెందాడు. ఆరోజ్ కుమార్కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.