అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. మంగళవారం ఆర్మూర్లోని ధోబీఘాట్, కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Purchase centers) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల(Farmers) నుంచి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, మిల్లులకు తరలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ధోబీఘాట్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు, తదితరులున్నారు.