అక్షరటుడే, వెబ్డెస్క్: Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. పీఆర్సీ(PRC)తో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల డిమాండ్లపై స్పందిస్తూ సీఎం రేవంత్రెడ్డి(Cm revanth reddy) సోమవారం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ మండిపడ్డాయి. రాష్ట్రం దివాళా తీసిందని, అప్పు పుట్టడం లేదని ఉద్యోగుల డిమాండ్లు ఇప్పుడు నెరవేర్చలేమని సీఎం అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రేవంత్రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పాలన చేతగాక అలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు జనంలోకి నెగెటివ్గా వెళ్లడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలపై కమిటీ వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో ఈ కమిటీ చర్చించనుంది. ఈ కమిటీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్లు సభ్యులుగా ఉంటారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.