ePaper
More
    HomeతెలంగాణGovernor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Varma | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్​ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో జిల్లాకు చెందిన ఆయా రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.

    తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్​కు విచ్చేశారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy), భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), రాకేశ్​ రెడ్డి (MLA Rakesh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి తదితరులు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.

    READ ALSO  Nizamabad Collector | అన్ని వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు కృషి చేయాలి

    Governor Jishnu Dev Varma | పథకాల అమలుపై ఫొటో ఎగ్జిబిషన్​..

    జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను గవర్నర్ తిలకించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫొటోల ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలిపారు. జిల్లాలో అమలవుతున్న పథకాల తీరును వివరించారు. ఈ మేరకు గవర్నర్ ఫొటో ఎగ్జిబిషన్​ను ఆసక్తిగా తిలకించారు.

    Governor Jishnu Dev Varma | ఆయా రంగాల్లో ప్రముఖులతో భేటీ..

    ఆయా రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులతో గవర్నర్ చర్చించారు. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ (Malavat Purna), అంతర్జాతీయ ఫుట్​బాల్​ క్రీడాకారిణి సౌమ్య (International footballer Soumya), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (Central Sahitya Akademi) గ్రహీత రమేష్ కార్తీక్ నాయక్​లతో మాట్లాడారు. వీరి అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను గవర్నర్​కు వివరించారు. అలాగే చరిత్రకారులు, ఆదర్శ రైతు, రచయితలు, కవులు, జానపద కళాకారులు, వాయిద్య కారులు, అష్టావధాని, సాహితీ పరిశోధకులు, విద్యావేత్తలు, చిత్రకారులు తదితర 40 మంది ప్రముఖులతో చర్చ గోష్టి జరిపారు. అనంతరం వారితో పాటు జిల్లా అధికారులతో కలిసి ఫొటో సెషన్​లో పాల్గొన్నారు.

    READ ALSO  Governor Jishnu Dev Varma | రాష్ట్రంలో తెలంగాణ వర్సిటీకి ప్రత్యేకస్థానం : గవర్నర్​

    Governor Jishnu Dev Varma | ఉదయం నుంచి బిజీ బిజీగా..

    రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొదటిసారి జిల్లా పర్యటనకు విచ్చేశారు. మొదటగా ఉదయం డిచ్​పల్లిలోని పోలీసు బెటాలియన్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ పలువురికి బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. భోజన విరామం అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​కు చేరుకొని పలువురు ప్రముఖులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    గవర్నర్​తో మాట్లాడుతున్న మాలావత్​ పూర్ణ, ఫుట్​బాల్​ క్రీడాకారిణి గుగ్లోత్​ సౌమ్య

    గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మతో కలెక్టర్​, సీపీ, ఇతర అధికారులు

    Latest articles

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    More like this

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...