ePaper
More
    HomeతెలంగాణHyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

    Hyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ప్రస్తుతం రెండు బస్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. మహాత్మ గాంధీ బస్​ స్టేషన్​ (ఎంజీబీఎస్​) (Mahatma Gandhi Bus Station), జూబ్లీ బస్టాండ్​ (జేబీఎస్​) (Jubilee Bus Stand) ఉన్నాయి. ఈ రెండు ప్రయాణ ప్రాంగణాల నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుస్తాయి. అయితే నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం మహా నగరంలో మరో బస్టాండ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ (Transport Minister Ponnam Prabhakar) ఓ టీవీ చానెల్​తో కొత్త బస్టాండ్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) మొదట ఎంజీబీఎస్ ఏర్పాటు చేశారు. ఇది నగరం మధ్యలో ఉంటుంది. దీనిని ఇమ్లిబన్​ బస్టాండ్​ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే ఐదో పెద్ద బస్టాండ్​ కావడం గమనార్హం. అయితే ఎంజీబీఎస్​ నగరంలో మధ్యలో ఉండడంతో రద్దీ తగ్గించడానికి జేబీఎస్​ ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎక్కువ శాతం జేబీఎస్​ వరకు నడుస్తాయి. అయితే ప్రస్తుతం నగరంలో జనాభా పెరగడంతో మరో బస్టాండ్​ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

    READ ALSO  Fake Liquor | కల్తీ మద్యానికి బ్రాండెడ్​ స్టిక్కర్లు.. బెల్ట్​ షాపులే లక్ష్యంగా విక్రయాలు

    Hyderabad | ఆరాంఘర్​ ప్రాంతంలో..

    మహబూబ్​నగర్, నల్గొండ, వికారాబాద్​​ వైపు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్​ నిర్మించాలని యోచిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ఆరాంఘర్​ ప్రాంతంలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఆ ప్రాంతం కాకపోతే మరో ప్రాంతంలో అయిన శంషాబాద్​ ఎయిర్​ పోర్టుకు (Shamshabad Airport) దగ్గరగా ఉండేలా బస్టాండ్​ నిర్మిస్తామన్నారు. అన్ని వసతులతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ఫోర్త్​ సిటీలో కూడా బస్టాండ్​, బస్​డిపో ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. బస్సుల రద్దీ పెరగడంతో ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

    Latest articles

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో...

    CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా...

    More like this

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో...