అక్షరటుడే, వెబ్డెస్క్: Kaleshwaram Project | మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిన ఘటనపై ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అక్రమాలు, అవినీతి నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్(Kaleshwar Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ దాదాపు 200 మంది అధికారులను విచారించింది. అంతేగాకుండా మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), అప్పటి మంత్రులు హరీశ్రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eetala Rajender)ను సైతం కమిషన్ విచారించింది. విచారణ ప్రక్రియ పూర్తవడంతో కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Kaleshwaram Project | క్రిమినల్ చర్యలకు యోచన
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleswaram Project)లో కీలకమైన మేడిగడ్డ కుంగిన విషయం తెలిసిందే. బ్యారేజీలోని పలు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిదంట. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ఘటనకు బాధ్యులపై కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మరికొందరికి షోకాజ్ నోటీసులు(Show Cause Notices) ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది.
Kaleshwaram Project | మంత్రి ఉత్తమ్ చర్చలు
మేడిగడ్డ కుంగుబాటుపై చర్యలు చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja), ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్(Prashant Jeevan)తో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు అప్పగించారు. అయితే ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనులు చూసిన అధికారులపై కేసు పెడతారా.. లేక కాంట్రాక్ట్ తీసుకన్న కంపెనీ పెడతారా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.