More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Private Schools | ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. అల్​రెడీ పెంచేసిన పాఠశాలలు

    Private Schools | ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. అల్​రెడీ పెంచేసిన పాఠశాలలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని కలలు కంటారు. తమ బిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తారు. సర్కార్​ బడుల్లో govt schools సరైన పర్యవేక్షణ ఉండదని ప్రైవేట్​ పాఠశాలల్లో private schools చేర్పిస్తారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇష్టారీతిన ఫీజులు fees వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ స్కూళ్లుండగా, వాటిలో 34.83 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో ఫీజుల వసూళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాటు అవుతోంది.

    Private Schools | ఇష్టం వచ్చినట్లు ఫీజులు

    ఏ పాఠశాలల, ఏ తరగతి ఎంత ఫీజు వసూలు చేయాలనే నిబంధనలు లేకపోవడంతో ఇష్టారీతిగా ఫీజులు తీసుకుంటున్నారు. పాఠశాల యాజమాన్యాలు తమకు నచ్చినంత ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా కుదేలు అవుతున్నారు. గతంలో బీఆర్​ఎస్ brs​ హయాంలో ఫీజుల నియంత్రణ కమిటీ వేసినా.. చర్యలు మాత్రం చేపట్టలేదు.

    READ ALSO  Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే..

    Private Schools | విద్యా కమిషన్​ ఏర్పాటు

    కాంగ్రెస్​ ప్రభుత్వం congress govt రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్​బాబు sridhar babu నేతృత్వంలో కేబినెట్​ సబ్ ​కమిటీ వేసింది. దీంతో పాటు విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడంతో.. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పలు పాఠశాలలు ముందుగానే ఫీజులను పెంచేశాయి. 2025–26 విద్యా సంవత్సరానికి 20 నుంచి 50 శాతం దాకా ఫీజులు పెంచేశాయి.

    Private Schools | వసతులు లేకున్నా..

    రాష్ట్రంలోని చాలా ప్రైవేట్​ పాఠశాలల్లో కనీస వసతులు లేవు. పలు బడులను అయితే రేకుల షెడ్డుల్లో నిర్వహిస్తున్నారు. ఆడుకోవడానికి గ్రౌండ్​ ఉండదు. ఇరుకు గదుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను కూర్చొబెడతారు. అయినా కూడా ఆయా పాఠశాలల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎల్​కేజీ విద్యార్థులకు రూ.పది వేల పైనే ఫీజు తీసుకుంటుండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులకు బడులను బట్టి రూ.30 వేల నుంచి రూ.12 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తుందనే వార్తలతో తల్లిదండ్రులు సంతోష పడేలోపే.. పాఠశాలలు ఫీజులను భారీగా పెంచడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Best Available School Scheme | ‘బెస్ట్‌ అవైలబుల్‌’ అమలుకు నిధులేవి?

    Latest articles

    Gadwal | ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్ చేసిన యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​...

    Gold Mining | విచిత్ర జీవితం.. భూగ‌ర్భం లోప‌ల ఉండి బంగారం త‌వ్వుతా.. ఒక అంత‌స్తు అస్తిపంజ‌రాలు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gold Mining | దక్షిణాఫ్రికా(South Africa)లోని ఒక చిన్న పట్టణం… మాఫియా గ్యాంగ్‌లు నియంత్రించే ఈ పట్టణంలో...

    Eatala Rajendar | కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్​.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Eatala Rajendar | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​పై బీజేపీ నేత, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​...

    Manas Sarovar Yatra | మానస సరోవర యాత్రికులకు లక్ష ఆర్థిక సాయం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Manas Sarovar Yatra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government) కీల‌క‌ నిర్ణయం తీసుకుంది....

    More like this

    Gadwal | ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్ చేసిన యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​...

    Gold Mining | విచిత్ర జీవితం.. భూగ‌ర్భం లోప‌ల ఉండి బంగారం త‌వ్వుతా.. ఒక అంత‌స్తు అస్తిపంజ‌రాలు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gold Mining | దక్షిణాఫ్రికా(South Africa)లోని ఒక చిన్న పట్టణం… మాఫియా గ్యాంగ్‌లు నియంత్రించే ఈ పట్టణంలో...

    Eatala Rajendar | కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్​.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Eatala Rajendar | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​పై బీజేపీ నేత, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​...