అక్షరటుడే, బోధన్: School Reopen | సుమారు 11 ఏళ్ల క్రితం మూతబడ్డ సర్కారు బడి ఎట్టకేలకు బుధవారం తెరుచుకుంది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బోధన్ (Bodhan) మండలంలోని భవానీపేట్లో (Bhavani pet) ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక మూతబడింది. అప్పటి నుంచి బడి మూతబడడంతో స్థానికులు సైతం ఇబ్బందులు పడ్డారు.
ఇన్నేళ్లకు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఎంఈవో నాగయ్య ఆధ్వర్యంలో బుధవారం స్కూల్ను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని అప్పుడే పాఠశాల మనుగడ సాధ్యమవుతందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో స్థానికులు తదితరలు పాల్గొన్నారు.

స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొడుతున్న ఎంఈవో నాగయ్య