ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGrama Panchayats | పల్లెల్లో పడకేసిన పాలన

    Grama Panchayats | పల్లెల్లో పడకేసిన పాలన

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Grama Panchayats | గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. 16 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో పల్లెలను పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రత్యేకాధికారులను (special officers) నియమించినా వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పాలన గాడి తప్పింది. దీంతో అభివృద్ధి పనులు అటకెక్కాయి. కనీసం పారిశుధ్య పనులు కూడా సక్రమంగా సాగడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    పల్లెల్లో స్పెషలాఫీసర్ల పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. సర్పంచ్​లు లేక గ్రామ పాలన భారమంతా పంచాయతీ కార్యదర్శులపై (Grama panchayat secretaries) పడింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు నుంచి పారిశుధ్యం, తాగు నీటి సమస్య, విధి దీపాలు ఇలా అన్ని బాధ్యతలు కార్యదర్శులే మోయాల్సి వస్తోంది. దీనితోడు నిధుల లేమి మరో సమస్యగా మారింది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీ కార్యదర్శులే అత్యవసర పనులకు సొంతంగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా అభివృద్ధి దేవుడెరుగు.. కనీస నిర్వహణ కరువైంది.

    READ ALSO  CM Revanth Reddy | రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్​, హరీశ్​ రావు : సీఎం రేవంత్​రెడ్డి

    Grama Panchayats | ఉమ్మడి జిల్లాలో వెయ్యికిపైగా గ్రామ పంచాయతీలు

    ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో (Joint Nizamabad districts) వెయ్యికి పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్​లో 545, కామారెడ్డిలో 537 జీపీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనల్లో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

    Grama Panchayats | సొంత ఖర్చులతో..

    గతంలో సర్పంచులు ఉన్నప్పుడు నిధులు లేకున్నా.. సొంత ఖర్చులతో పనులు చేపట్టేవారు. ప్రస్తుతం జీపీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు నిధులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో కార్మికులు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఏప్రిల్ నుంచి జీతాలు రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. అయినా అధికారులు ఏమి చేయలేని పరిస్థితి.

    READ ALSO  Mission Bhagiratha | "భగీరథ" పన్ను వసూళ్లపై విచారణ.. ‘అక్షరటుడే’ కథనంతో కదలిక

    Grama Panchayats | అస్తవ్యస్తంగా పారిశుధ్యం

    నిధులు.. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. చాలా గ్రామాల్లో కార్మికులు జీతాలు రాకపోవడంతో పూర్తిస్థాయిలో పనులు చేయడం లేదు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం మానేశారు. నీటి సరఫరా నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నిధులు లేకపోవడంతో చెత్త సేకరణ సైతం నిలిపేశారు. జీపీ ట్రాక్టర్లు, ట్యాంకర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అసలే వర్షాకాలం కావడంతో వ్యాధుల ముప్పు పొంచు ఉంటుంది. ఇలాంటి సమయంలో గ్రామాలను పట్టించుకునే వారు లేక పరిస్థితి అధ్వానంగా మారింది.

    Grama Panchayats | మంచినీరు రావడం లేదు

    గ్రామంలో కుళాయిల ద్వారా తాగునీరు రావడం లేదు. దీంతో పంట పొలాలు, దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. డ్రెయినేజీలు శుభ్రం చేయక కంపు కొడుతున్నాయి.

    READ ALSO  Kamareddy | కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్​గా వాల్యా.. జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా వెంకటేశ్వర్​

    Grama Panchayats | జీతాలు రావడం లేదు

    మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు. కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    Grama Panchayats | ప్రతినెలా వేతనాలు చెల్లించాం

    ప్రతినెలా పంచాయతీ కార్మికులకు ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలలో ఆలస్యమైతే కార్మికులకు సొంత డబ్బులతో వేతనాలు చెల్లించేవాళ్లం.

    Grama Panchayats | కార్మికుల ఖాతాల్లోనే నేరుగా జమ

    పంచాయతీ కార్మికులకు నేరుగా ఖాతాలోనే వేతనాలు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదు. త్వరలో వేతనాలు అకౌంట్లో జమ చేయనుంది.

    Latest articles

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    More like this

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...