More
    HomeజాతీయంProperty Registration | కేంద్రం గుడ్​న్యూస్.. ఇక ఇంట్లో నుంచే రిజిస్ట్రేషన్!

    Property Registration | కేంద్రం గుడ్​న్యూస్.. ఇక ఇంట్లో నుంచే రిజిస్ట్రేషన్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Property Registration | ఆస్తుల రిజిస్ట్రేషన్ (Property Registration )​ ప్రస్తుతం పెద్ద ప్రక్రియ. ఏ ఆస్తిని రిజిస్ట్రేషన్​ చేయించాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే.

    సబ్​ రిజిస్ట్రార్(Sub Registrar)​ ఆఫీసుల్లోకి నేరుగా వెళితే పనులు కాని పరిస్థితి. డాక్యుమెంట్​ రైటర్లను వెంట పెట్టుకొని వెళ్లి.. చేతులు తడిపితే గానీ రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఇలాంటి బాధలకు చెక్​ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచే రిజిస్ట్రేషన్​ చేసుకునేలా కొత్త చట్టం తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ విధానం property registration at online అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్రం యోచిస్తోంది.

    Property Registration | 1908 చట్టంలో మార్పు

    ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ల చట్టం 1908 నాటిది. బ్రిటిష్​ కాలంలో రూపొందించిన ఈ చట్టాన్ని మార్చాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ల (Registrations) కోసం చట్టాలను మార్చాయి. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్​ గతంలోనే తహశీల్దార్లకు అప్పగించారు. ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కోసం సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో స్లాట్​ బుకింక్ (slot booking)​ విధానం కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు.

    READ ALSO  Nizamabad OBC Morcha | సమగ్రాభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం

    ఈ క్రమంలో కేంద్రం కూడా పాత చట్టాన్ని మార్చాడానికి కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ చట్టం అమలులోకి వస్తే.. దరఖాస్తుదారు ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో నుంచి రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఆన్‌‌లైన్ ద్వారా ఈజీగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం ప్రాపర్టీ ఈ-సర్టిఫికేట్లను పొందొచ్చు. పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ సర్టిఫికేట్, ఈక్విటబుల్ మార్ట్‌గేజ్ వంటి డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడం తప్పనిసరి కానుంది.

    Property Registration | ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం

    ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్​ చట్టాన్ని మార్చడానికి కేంద్రం ప్రజాభిప్రాయ (Public opinion) సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ చట్టం అమలు విషయాలు ఆయా రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదింపులు జరిపి తమ రాష్ట్ర చట్టాల్లో మార్పులు చేసుకోవచ్చు. కాగా.. కొత్త చట్టం కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల విభాగం మే 27న ముసాయిదాను విడుదల చేసింది. ప్రజలు ఆన్​లైన్​ ద్వారా జూన్​ 27లోగా తమ అభిప్రాయాలను తెలిపాల్సిందిగా కేంద్రం కోరింది.

    READ ALSO  Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    Property Registration | ఆధార్​ కార్డుతో..

    ప్రస్తుతం అన్నింటికి ఆధార్​ కార్డు(Aadhar card) తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కూడా ఆన్​లైన్​ ఆధార్​ కార్డు ద్వారానే చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అవినీతి, మోసాల నివారణ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తీసుకు రానున్నారు. ఆధార్​ లింక్​ ఉన్న మొబైల్​ నంబర్​కు వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. కాగా ఈ ముసాయిదా బిల్లుపై ప్రజల అభిప్రాయలు సేకరించిన అనంతరం కేంద్రం పార్లమెంట్​లో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్​లో బిల్లు ఆమోదం పొందింతే ఈ చట్టం అమలులోకి వస్తుంది.

    Latest articles

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    More like this

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...