More
    HomeజాతీయంUnion Cabinet | రైతులకు కేంద్రం గుడ్​న్యూస్​.. పంటల మద్దతు ధర పెంపు

    Union Cabinet | రైతులకు కేంద్రం గుడ్​న్యూస్​.. పంటల మద్దతు ధర పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MSP Hike | రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Govy) గుడ్​ న్యూస్​ చెప్పింది. పంటల మద్దతు ధర(MSP) పెంచుతు కేంద్ర కేబినెట్ (Union Cabinet)​ నిర్ణయం తీసుకుంది.

    ప్రధాని మోదీ(PM Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్​ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో వరి(Paddy)తో సహా 14 పంటల మద్దతు ధర పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏ గ్రేడ్​ ధాన్యం క్వింటాల్​ ధర రూ.2,320 ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్వింటాల్​కు రూ.69 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరి ఏ గ్రేడ్​ రకం ధర క్వింటాల్​కు రూ.2,389 కానుంది.

    Union Cabinet | ఏటా ధర పెంపు

    కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండటానికి ఏటా పంటల మద్దతు ధరను పెంచుతుంది. వానాకాలం సీజన్​ ప్రారంభంలో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ధర వానాకాలం, యాసంగి సీజన్​లకు అందుబాటులో ఉంటుంది. కాగా.. బుధవారం కేబినెట్​ మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Minister Aswini vaishnav)​ మీడియాకు వెల్లడించారు. గత పదేళ్లుగా ఖరీఫ్ పంటలకు మద్దతు ధర భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా ఎంఎస్‌పీ పెంపును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిందన్నారు.

    READ ALSO  Plane Crash | విమానం కూలిన ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

    ఆయా పంటలకు మద్దతు ధర కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ (Interest Subsidy) కింద రూ.15,642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.

    Union Cabinet | ధరలు ఎంత పెరిగాయంటే..

    మొత్తం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ, ఏ గ్రేడ్​ ధాన్యం రేటు క్వింటాల్​కు రూ.69 పెంచాలని నిర్ణయించింది. దీంతో సాధారణ రకం ధర క్వింటాల్​కు రూ.2,369, ఏ గ్రేడ్​ ధాన్యం ధర రూ.2,389 కానుంది. జొన్నలు క్వింటాల్​కు రూ.328 పెంచింది. సజ్జల ధర రూ.150, రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, పెసర రూ.86, కందిపప్పు రూ.450, వేరుశెనగ రూ.480, మినుములు రూ.400, పొద్దుతిరుగుడు రూ.441, కుసుమలు రూ.579, సోయాబీన్ రూ.436, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    READ ALSO  Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతుభరోసా, బోనస్​పై కీలక ప్రకటన

    Union Cabinet | బద్వేల్​– నెల్లూరు రోడ్డుకు ఆమోదం

    కేంద్ర ప్రభుత్వం ఏపీలోని బద్వేల్‌- నెల్లూరు(Badwel- Nellore) మార్గంలో నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108 కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....