More
    HomeజాతీయంDiabetes | షుగర్​ పేషెంట్స్ కు గుడ్​న్యూస్​.. రూ. 15కే డయాబెటిస్ పరీక్ష

    Diabetes | షుగర్​ పేషెంట్స్ కు గుడ్​న్యూస్​.. రూ. 15కే డయాబెటిస్ పరీక్ష

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Diabetes : హైదరాబాద్​(Hyderabad)లో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ (Birla Institute of Technology and Science (BITS) Pilani campus) పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మధుమేహాన్ని (డయాబెటిస్) తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో గుర్తించే ‘బయో సెన్సర్'(biosensor)ను రూపొందించారు. చుక్క రక్తం కూడా తీయకుండా కేవలం రూ.15 కే షుగర్​ లెవెల్స్ టెస్టు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

    Diabetes : సంప్రదాయ పద్ధతుల్లో..

    సాధారణంగా వేలిపై సూదితో పొడిచి రక్తం నమూనా(blood sample) తీసుకుని అందులో గ్లూకోజ్ లెవల్స్ పరిశీలిస్తుంటారు. తాజాగా బిట్స్ పిలానీ పరిశోధకులు రూపొందించిన టెస్టులో సూది గుచ్చకుండానే శరీరంలోని గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయి తెలుసుకోవచ్చు.

    Diabetes : బయో సెన్సర్ సాయంతో..

    బయో సెన్సర్ మనిషి శరీరంలోని జీవక్రియలకు సంబంధించిన సమాచారం సేకరిస్తుందని బిట్స్ పిలానీ (BITS Pilani) హైదరాబాద్ పరిశోధకులు తెలిపారు. అంటే చెమట, మూత్రం సాయంతో గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు వీలవుతుందంటున్నారు.

    READ ALSO  Kamareddy Town Ci | కామారెడ్డి టౌన్​ సీఐగా నరహరి.. చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు

    పరిశోధకులు రూపొందించిన ఈ పరిశోధనకు బిట్స్ పిలానీ BITS Pilani క్యాంపస్‌లోని ఎంఈఎంఎస్(MEMS), మైక్రోఫ్లూయిడ్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్ (ఎంఎంఎన్ఈ) ల్యాబ్‌Microfluidics and Nanoelectronics (MMNE) Lab ప్రొఫెసర్ సంకేత్ గోయెల్ ఇన్వెస్టిగేటర్‌గా ఉన్నారు. ఆచార్య డి. శ్రీరామ్ కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ఉన్నారు. పీహెచ్‌డీ స్కాలర్ సోనల్ ఫండే ఈ పరిశోధనలో భాగస్వామ్యం అయ్యారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ పరిశోధనకు సహకారం అందజేసింది.

    Diabetes : పనితీరు ఇలా..

    ఎలక్ట్రో కెమికల్(electrochemical) సెన్సింగ్ ఆధారంగా బయోసెన్సర్ పనిచేస్తుంది. ఇందులో పాలీ అమైడ్ షీట్‌పై ఇంక్ జెట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సెన్సర్లు అమర్చారు. ”2.5వ జనరేషన్ సెన్సర్ ఈ బయోసెన్సర్ లో వినియోగించినట్లు సోనల్ ఫండే తెలిపారు. చెమట, మూత్రం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను బయోసెన్సర్ గుర్తించి పోర్టబుల్ పొటెన్షియోస్టాట్ తీసుకుని, స్మార్ట్ ఫోన్‌కు సిగ్నల్స్ పంపిస్తుంది. అందులో లాక్టోజ్, గ్లూకోజ్ స్థాయిలు ఆవిష్కృతం అవుతాయని అని సోనల్ వివరించారు. బాడీలోని కణజాలం నుంచి కూడా గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయిలను గుర్తించగలదని చెప్పారు. పొటెన్షియోస్టాట్, బయోసెన్సర్ రూ.700 ‌‌- 800 కు దొరుకుతుందని, టెస్ట్ చేయడానికి మాత్రం కేవలం రూ.15 లే ఖర్చవుతుందన్నారు.

    READ ALSO  Rain Alert | నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

    Latest articles

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team...

    Russia | శిక్షణ విమానం కూలిపోయి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russia : మాస్కో(Moscow) ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం (జూన్ 28) తేలికపాటి శిక్షణ విమానం...

    More like this

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team...