More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. 8 ప్రత్యేక రైళ్లు

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. 8 ప్రత్యేక రైళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఎక్కువ శాతం భక్తులు రైలు మార్గంలోనే తిరుపతి చేరుకుంటారు. దీంతో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే టికెట్లు రిజర్వ్​ అయిపోతాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ చెప్పింది. కరీంనగర్​ నుంచి తిరుపతికి (Karimnagar to Tirupati) ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.

    తిరుపతి నుంచి కరీంనగర్​కు జూలై 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు (Special Train) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం నాలుగు సర్వీసులు నడుపుతామని తెలిపింది. అలాగే కరీంనగర్​ నుంచి తిరుపతికి జూలై 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం ఒక రైలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ రైళ్లు పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్​, మహబూబాబాద్​, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

    READ ALSO  Tirumala | తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

    Latest articles

    Kamareddy | 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలోని 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు చేసినట్లు జిల్లా...

    Japan | జ‌పాన్‌లో ఖాళీగా ఉన్న 90 ల‌క్ష‌ల ఇళ్లు.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan | ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో (Japan) కొత్త సమస్య...

    Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ నగర యాదవ సంఘంలో ఆదివారం సర్వసభ్య...

    Reunion | ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

    అక్షరటుడే, నిజామాబాద్, కామారెడ్డి: Reunion | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు (joint Nizamabad district) చెందిన 2000 బ్యాచ్...

    More like this

    Kamareddy | 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలోని 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు చేసినట్లు జిల్లా...

    Japan | జ‌పాన్‌లో ఖాళీగా ఉన్న 90 ల‌క్ష‌ల ఇళ్లు.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan | ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో (Japan) కొత్త సమస్య...

    Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

    అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ నగర యాదవ సంఘంలో ఆదివారం సర్వసభ్య...