ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​RRB Notification | రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. టెక్నీషియన్‌ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    RRB Notification | రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. టెక్నీషియన్‌ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నవారికి ఆర్‌ఆర్‌బీ(RRB) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెక్నీషియన్‌ గ్రేడ్‌–1 సిగ్నల్‌, గ్రేడ్‌–3 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28వ తేదీ వరకు గడువుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(Railway Recruitment Board)ల ద్వారా సుమారు 6 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

    RRB Notification | నోటిఫికేషన్‌ వివరాలు..

    భర్తీ చేసే పోస్టులు: మొత్తం : 6,238
    టెక్నిషియన్‌ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ : 183
    టెక్నిషియన్‌ గ్రేడ్‌ 3 : 6,055

    అర్హతలు: గ్రేడ్‌ 1 సిగ్నల్‌: డిప్లొమా/ఎస్సీ/ బీఈ/బీటెక్‌(ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌)
    గ్రేడ్‌ 3: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి, ఐటీఐ (ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, మెకానిక్‌, టర్నర్‌, పెయింటర్‌, డీజిల్‌ మెకానిక్‌, మెకట్రానిక్స్‌ ట్రేడ్స్‌)

    READ ALSO  Layoffs | సంక్షోభంలో టెక్ ఇండ‌స్ట్రీ.. ఆర్నెళ్ల‌లో ల‌క్ష మందికి ఉద్వాసన‌

    వయోపరిమితి (జూలై 1, 2025 నాటికి):
    గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు.. : 18 నుంచి 33 ఏళ్లు.
    గ్రేడ్‌ 3: 18 నుంచి 30 ఏళ్లు
    ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

    వేతనం:గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు.. : రూ. 29,200 (లెవెల్‌ 5)
    గ్రేడ్‌ 3 పోస్టులకు : రూ. 19,900 (లెవెల్‌ 2)

    ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(Computer Based Test) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు (గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టులకు వేరువేరుగా సీబీటీ ఉంటుంది). వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల గడువు ఇస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది. సీబీటీ(CBT)లో సత్తా చాటినవారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టులు ఉంటాయి.

    READ ALSO  Government Employees | ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. నాలుగు శాతం డీఏ పెంపుతో పెర‌గ‌నున్న జీతాలు

    అర్హత మార్కులు: అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరి, ఈడబ్ల్యూఎస్‌(EWS) అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ, ఎస్సీలు 30 శాతం, ఎస్టీలు 25 శాతం మార్కులు సాధించాలి.

    ముఖ్య తేదీలు:దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: ఈనెల 28.
    ఫీజు చెల్లింపునకు చివరి తేది: ఈనెల 30.
    దరఖాస్తుల సవరణకు అవకాశం : వచ్చేనెల ఒకటో తేదీనుంచి 10వ తేదీ వరకు..
    పూర్తి వివరాలకు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌(వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in)ను పరిశీలించగలరు.

    Read all the Latest News on Aksharatoday.in

    Latest articles

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    Karnataka | క‌ర్ణాట‌కలో మ‌ళ్లీ మొద‌టికొచ్చిన వివాదం.. నాయ‌క‌త్వాన్ని మార్చాల‌న్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ అంశం దుమారం రేపుతూనే ఉంది. ఐదేళ్లూ ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని...

    Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Temple | దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆలయ భూములను యథేచ్ఛగా...

    More like this

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    Karnataka | క‌ర్ణాట‌కలో మ‌ళ్లీ మొద‌టికొచ్చిన వివాదం.. నాయ‌క‌త్వాన్ని మార్చాల‌న్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ అంశం దుమారం రేపుతూనే ఉంది. ఐదేళ్లూ ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని...