అక్షరటుడే, వెబ్డెస్క్: EPFO | లక్షలాది మంది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization) గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెంచడంతో సభ్యులు ఇక నుంచి రూ. 5 లక్షల వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఇప్పటివరకు రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తాల ముందస్తు ఉపసంహరణ కోసం సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్(Manual Verification) కోసం వేచి చూడాల్సి వచ్చేది. లక్షలాది మందికి భారీ ఉపశమనం కల్పిస్తూ అడ్వాన్స్ క్లెయిమ్స్ (ASAC) కోసం ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ఈపీఎఫ్వో రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ఇది ముఖ్యంగా అత్యవసర సమయాల్లో త్వరగా నిధుల యాక్సెస్ను సులభతరం చేస్తుంది. ఈపీఎఫ్వో తాజా విధాన నిర్ణయం మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండా మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సభ్యులకు త్వరిత ఆర్థిక సహాయం అందించడానికి మహమ్మారి సమయంలో EPFO మొదట అడ్వాన్స్ క్లెయిమ్ల ఆటో-సెటిల్మెంట్ను ప్రవేశపెట్టింది.
ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెరుగుదలతో సభ్యులు రూ. 5 లక్షల వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఇప్పటివరకు, రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తాల ముందస్తు విత్ డ్రా కోసం మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. నాన్-ఆటో సెటిల్మెంట్కు ఈపీఎఫ్వో చందాదారులు EPFO కార్యాలయాలను సందర్శించి మాన్యువల్ ఆమోదం పొందాల్సి ఉండేది. ఇది చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈపీఎఫ్వో దీన్ని సవరించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(Central Board of Trustees Executive Committee) గత మార్చి నెలలో ASAC పరిమితిని రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఆమోదించింది. అంతకు ముందు ASAC పరిమితి రూ.50 వేలు ఉండగా, 2024 మేలో దాన్ని రూ. లక్షకు పెంచారు. FY24లో దాదాపు 9 మిలియన్ల మేర ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్లు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 మిలియన్లకు చేరాయి.