అక్షరటుడే, వెబ్డెస్క్:Fastag | వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్(Fastag)పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. రూ.3వేలు చెల్లిస్తే ఏడాదంతా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వాహనదారులకు టోల్ (Toll charges) భారం చాలా వరకు తగ్గనుంది. రూ.3వేలు చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్పుల ప్రయాణం పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది
Fastag | తగ్గనున్న భారం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులపై టోల్ భారం తగ్గనుంది. దేశంలోని హైవేలు (highway tolls), ఎక్స్ ప్రెస్ వే (expressways tolls) నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై టోల్ ఛార్జీల (Toll charges) భారం ఎక్కువగా పడుతుందని కేంద్ర ప్రభుత్వం (Central Government) భావించింది. దీంతో ప్రయాణికులపై టోల్ భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాది వార్షిక పాసులను తీసుకోవడం ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పుల వరకు ఎక్కడైనా ప్రయాణించే అవకాశం లభించనుంది.
Fastg | అన్ని హైవేలపై వర్తింపు
కొత్త ఫాస్టాగ్ (Fastag pass) విధానంలో దేశంలోని అన్ని జాతీయ రహదారులతో పాటు రాష్ట్రాల అధీనంలో ఉండే ఎక్స్ ప్రెస్ దారులపైనా చెల్లుబాటు కానుంది. ప్రస్తుతం నెలవారీ పాస్లు మాత్రమే జారీ చేస్తున్నారు. కొత్త పాలసీ అమల్లోకి వస్తే ఏడాది కాలానికి పాస్లు ఇస్తారు.