More
    Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. లడ్డూ ప్రసాదం కోసం వేచి ఉండాల్సిన పని లేదు

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. లడ్డూ ప్రసాదం కోసం వేచి ఉండాల్సిన పని లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండి స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అయితే స్వామి దర్శనం అనంతరం భక్తులు లడ్డూల (Laddus) కోసం కూడా బారులు తీరుతారు. ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ (TTD) కీలక చర్యలు చేపట్టింది. ఇక నుంచి కౌంటర్లతో పాటు కియోస్క్ (Kiosk)​ల ద్వారా కూడా లడ్డూ టోకెన్లు అందుబాటులో ఉంచింది.

    Tirumala | భక్తుల సౌకర్యార్థం

    తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో టీటీడీ ఐదు కియోస్క్‌ మిషన్లను ఏర్పాటు చేసింది. లడ్డూ కౌంటర్లలో (Laddu Counters) రద్దీని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అదనంగా లడ్డూలు కొనుగోలు చేయాల్సిన భక్తులు మొదట కౌంటర్​లో టోకెన్లు తీసుకోవాలి. అనంతరం ఆ టోకెన్లు ఇచ్చి లడ్డూలు పొందాల్సి ఉంది. అయితే టోకెన్లు తీసుకునే సమయంలో రద్దీ అధికం అవుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం టోకెన్ల కోసం తాజాగా కియోస్క్​లను అధికారులు ఏర్పాటు చేశారు.

    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Tirumala | 15 లడ్డూలు పొందవచ్చు

    భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లపై ఉండే నంబర్​ను ఈ కియోస్క్‌లో నమోదు చేసి 15 లడ్డూల వరకు పొందవచ్చు. టికెట్​ నంబర్​ ఎంటర్​ చేసిన తర్వాత లడ్డూల సంఖ్య నమోదు చేయాలి. అనంతరం అక్కడ కనిపించే క్యూ ఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి యూపీఐ ద్వారా పేమేంట్​ చేస్తే లడ్డూ టోకెన్లు వస్తాయి. వాటిని కౌంటర్‌లో ఇచ్చి లడ్డూలు పొందవచ్చు. ఎలాంటి దర్శన టోకెన్లు, టికెట్లు లేని భక్తులైతే తమ ఆధార్‌ నంబర్​ను నమోదు చేసి రెండు లడ్డూలు పొందవచ్చు. భవిష్యత్​ వీటి సంఖ్యను నాలుగు పెంచుతామని టీటీడీ అధికారులు తెలిపారు.

    లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం అయితే మరికొన్ని ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతంలో కియోస్క్​ల ద్వారా విరాళాలు అందించే విధానాన్ని ప్రారంభించిన టీటీడీ తాజాగా లడ్డూ టోకెన్ల జారీ కోసం కూడా వాటిని ఏర్పాటు చేసింది.

    READ ALSO  Aashada Masam | విష్ణు పూజ.. గురు ఆరాధన.. అమ్మకు బోనం.. ఎన్నో విశిష్టతల మాసమే ఆషాఢం

    Latest articles

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు...

    Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్టేట్ హెల్త్ మానిటరింగ్ బృందం (State...

    More like this

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు...