అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను మట్టుబెడుతున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే అంతమొందించిన అనేక ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ మర్డర్ లాంటివి కాకుండా.. ఆ ప్రియురాలు దొంగతనానికి పాల్పడింది.
ప్రియుడు కోసం పెళ్లి మండపం wedding hall లోనే ఓ ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు Tamil Nadu లోని కృష్ణగిరి Krishnagiri లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో అతడి ప్రియురాలు జ్యోతి 21 సవరాల నగలను దోచుకెళ్లింది.
సీసీ ఫుటేజీ CCTV footage ఆధారంగా ప్రియురాలితోపాటు ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు POLICE అరెస్టు చేశారు. ప్రియుడి అప్పు తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్లుగా పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.