అక్షరటుడే, వెబ్డెస్క్ : Indigo Flight | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన తర్వాత కూడా ఎయిర్లైన్ సంస్థలు జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో వరుసగా జరుగుతున్న పలు ఘటనలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇటీవల అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 270కి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయినా కూడా విమాన సంస్థలు (Airlines) కళ్లు తెరవడం లేదు. ఇటీవల పలు ఎయిర్ ఇండియా (Air India) విమానాలు రన్వేపైకి వచ్చాక సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇండిగో విమానం (Indigo Flight) గాలిలో ఉండగానే.. ఇంధనం అయిపోవడానికి వచ్చింది. దీంతో ఫైలెట్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
Indigo Flight | ఇంధనం లేకపోవడంతో..
గౌహతీ నుంచి ఇండిగో విమానం శనివారం చెన్నై బయలుదేరింది. గాలిలో ఉండగానే విమానంలో ఇంధన కొరత నెలకొంది. దీంతో అప్రమత్తమైన పైలెట్ మే డే కాల్ ఇచ్చారు. అనంతరం విమానాన్ని అత్యవసరంగా బెంగళూరు (Bengaluru airport)లో ల్యాండ్ చేశారు. విమానం సేఫ్గా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం సాంకేతిక సమస్యల పేరుతో పలు విమానాలను నిలిపివేస్తున్నారు. దీంతో విమానం ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు.