ePaper
More
    Homeక్రీడలుIND vs ENG | నేటి నుంచి భార‌త్- ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. గాయాల‌తో ప‌లువురు...

    IND vs ENG | నేటి నుంచి భార‌త్- ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. గాయాల‌తో ప‌లువురు భార‌త క్రికెట‌ర్స్ దూరం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IND vs ENG | భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ టాప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల తర్వాత సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యం సంపాదించింది. ఇక నాలుగో టెస్ట్‌ మ్యాచ్ జులై 23న మాంచెస్టర్‌(Manchester)లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం భార‌త్‌కు త‌ప్ప‌నిస‌రి. ఓడితే మాత్రం సిరీస్ కోల్పోయిన‌ట్టే. ఇక ఇంగ్లాండ్ జట్టు(England Team) ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో 3-1తో ఆధిక్యం సాధించాలని కోరుకుంటోంది. ఈ మ్యాచ్ గెల‌వాల‌ని భార‌త్ బలంగా కోరుకుంటున్నా.. జ‌ట్టు ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌డం పెద్ద స‌మ‌స్యగా మారింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున‌ ఎవరెవరు ఆట‌గాళ్లు ఆడ‌తారు, ఎవ‌రు రెస్ట్ తీసుకుంటారు అనే దానిపై సందిగ్ధం నెల‌కొంది.

    READ ALSO  Andre Russel | అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్ప‌నున్న విధ్వంస‌క‌ర ఆట‌గాడు

    IND vs ENG | ఎవ‌రు గెలుస్తారు?

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌(Test Series)లో కీలకమైన నాలుగో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో పలు ముఖ్య అంశాలపై స్పష్టత ఇచ్చారు. గాయాల కారణంగా జట్టులో మార్పులు తప్పవని ఆయన తెలిపారు. పేసర్ ఆకాష్ దీప్ గజ్జల్లో గాయంతో టెస్ట్‌కు దూరం కానున్నాడ‌ని తెలియ‌జేశారు. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) చేతి గాయంతో అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల హర్యానా ఫాస్ట్ బౌలర్ అంశుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా ఉందని గిల్(Shubman Gill) తెలిపారు. అంశుల్ బౌలింగ్‌లో బాగా ఆకట్టుకున్నాడు. ప్రసిద్ కృష్ణనా, లేకుంటే అంశుల్‌లో ఎవ‌రిని తీసుకోవాలా అనే దాని గురించి ఆలోచిస్తాం అని చెప్పారు.

    READ ALSO  WTC Finals | ఐసీసీ నిర్ణ‌యంతో నిరాశ‌లో భార‌త్.. 2031 వరకు WTC ఫైనల్స్ అక్కడే..!

    మూడో టెస్టులో వేలి గాయం కారణంగా కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్‌(Rishab Panth) ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. నాలుగో టెస్టులో వికెట్ కీపింగ్‌ను తిరిగి చేపట్టనున్నట్లు గిల్ ధ్రువీకరించారు. ఇది జట్టుకు భారీ బూస్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సిరీస్‌లో పెద్దగా స్కోర్లు చేయలేకపోయిన కరుణ్ నాయర్‌పై విశ్వాసం వ్యక్తం చేసిన గిల్, “అతను ఫామ్‌లోకి వస్తాడు. తన స్థానంలో బ్యాటింగ్ చేయ‌లేదు, అత‌నితో మాట్లాడాము అంటూ మద్దతు తెలిపారు శుభ్‌మ‌న్ గిల్. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కి దూరమవడంతో భారత్ కనీసం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కాంబోజ్ లేదా ప్రసిద్ కృష్ణ పేస్ విభాగాన్ని భర్తీ చేయనుండగా, నితీష్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్ లేదా ఆల్‌రౌండర్ ఆడే అవకాశం ఉంది. భార‌త‌ జట్టు గాయాల సమస్యలతో పోరాడుతుండగా, వర్షం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

    READ ALSO  Uppal Stadium | ఉప్పల్‌ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

    Latest articles

    Pocharam Bhaskar Reddy | తల్లిదండ్రుల రుణం తీసుకోలేనిది: పోచారం భాస్కర్ రెడ్డి

    అక్షరటుడే, బాన్సువాడ: Pocharam Bhaskar Reddy | తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని  డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్...

    Vice President | జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవిపై జోరుగా చర్చలు.. ఎవరు కొత్త ఉపరాష్ట్రపతి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో రెండో స్థానంలో ఉండే ఉపరాష్ట్రపతి...

    Urea | కోళ్లఫారాలను తనిఖీ చేసిన అధికారులు

    అక్షరటుడే, కోటగిరి: Urea | యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న...

    Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి జైలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురికి జైలు శిక్షతోపాటు మరో...

    More like this

    Pocharam Bhaskar Reddy | తల్లిదండ్రుల రుణం తీసుకోలేనిది: పోచారం భాస్కర్ రెడ్డి

    అక్షరటుడే, బాన్సువాడ: Pocharam Bhaskar Reddy | తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని  డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్...

    Vice President | జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవిపై జోరుగా చర్చలు.. ఎవరు కొత్త ఉపరాష్ట్రపతి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో రెండో స్థానంలో ఉండే ఉపరాష్ట్రపతి...

    Urea | కోళ్లఫారాలను తనిఖీ చేసిన అధికారులు

    అక్షరటుడే, కోటగిరి: Urea | యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న...