అక్షరటుడే, వెబ్డెస్క్:YCP | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న హామీలు అమలు చేయడం లేదని వైసీపీ(YCP) ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Former Minister Botsa Satyanarayana) వాహనంపై ఉండి మాట్లాడుతూ.. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో నాయకులు ఆయనను వెంటనే విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు.
YCP | బొత్స కోలుకుంటున్నారు..
బొత్స సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన సోదరుడు అప్పల నర్సయ్య స్పందించారు. ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం బొత్సకు ఓపెన్ హార్ట్ సర్జరీ(Open heart surgery) జరిగిందన్నారు. ఈరోజు ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలో పాల్గొని అలసిపోవడంతో పడిపోయారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.