అక్షరటుడే, వెబ్డెస్క్ : Ceasefire | విక్రమ్ మిస్రీ vikram misri.. మొన్నటి వరకు ఎవరికి అంతగా పరిచయం లేని ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సుపరిచితం. ఆపరేషన్ సిందూర్ operation sindoor అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ నిత్యం మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తీరు గురించి ఆయన కల్నల్ సోఫియా ఖురేషి sofia khureshi, వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ vyomika singhతో కలిసి ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలు, రక్షణ చర్యలను ఆయన వివరించారు. అయితే మిస్రీతో పాటు ఆయన కుటుంబాన్ని ప్రస్తుతం కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిని ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి.
Ceasefire | సీజ్ఫైర్ అనౌన్స్ చేయడంతో..
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాక్ డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో భారత్పై దాడులకు యత్నించింది. అయితే భారత రక్షణ వ్యవస్థ indian defence system పాక్ దాడులను తిప్పికొట్టింది. అనంతరం భారత్ ప్రతిదాడులు చేసి దాయాది దేశానికి భారీ నష్టం చేకూర్చింది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణ ceasefire కు అంగీకరించాయి. కాల్పుల విరమణకు అంగీకరించిన విషయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. దీంతో ఆయనను కొందరు ట్రోల్ చేస్తున్నారు.
Ceasefire | కుటుంబ సభ్యులపై కూడా..
సీజ్ఫైర్ నిర్ణయం వివరాలు ప్రకటించినందుకు కొందరు విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిస్రీని ట్రోల్ చేస్తున్నారు. భారత్ యుద్ధం చేసి పాక్ పని పట్టకుండా ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించారంటూ ట్రోల్ చేస్తున్నారు. సీజ్ఫైర్ను ప్రకటించిన పాపానికి, మిస్రీతో పాటు ఆయన కుమార్తెపై కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఆయన కుమార్తె ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పెట్టి మరీ ట్రోలింగ్ చేశారు. దీంతో మిస్రీ తన ట్విటర్ ఖాతాను లాక్ చేసుకున్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన అధికారిని ట్రోల్ చేయడాన్ని ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. మిస్రీతో పాటు ఆయన ఫ్యామిలీపై జరిగిన వ్యక్తిగత దాడుల్ని తప్పు పట్టింది. తమ విధులకు కట్టుబడి ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారిపై ఇలాంటి దాడులు సరికావని పేర్కొంది. పలువురు అధికారులు మిస్రీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.