More
    HomeజాతీయంForeign Direct Investment | ఎఫ్‌డీఐల‌ ఆక‌ర్షణ‌లో ‘మ‌హా’ ముంద‌డుగు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకే ఎక్కువ‌గా విదేశీ...

    Foreign Direct Investment | ఎఫ్‌డీఐల‌ ఆక‌ర్షణ‌లో ‘మ‌హా’ ముంద‌డుగు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకే ఎక్కువ‌గా విదేశీ పెట్టుబ‌డులు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Foreign Direct Investment | విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను (FDI) ఆక‌ర్షించ‌డంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో సింహ‌భాగం ఈ ప్రాంతానికే రావ‌డం గ‌మ‌నార్హం. 2025లో దేశంలోకి వ‌చ్చిన విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల్లో మ‌హారాష్ట్ర‌(Maharashtra), క‌ర్ణాట‌క(Karnataka) 51 శాతం వాటా క‌లిగి ఉండ‌డం విశేషం.

    ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర‌లోకే అత్య‌ధికంగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజా గ‌ణంకాలు వెల్ల‌డించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర గరిష్టంగా 19.6 బిలియ‌న్ డాల‌ర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది మొత్తం దేశంలోకి వ‌చ్చిన‌ FDIల‌లో 31 శాతం ఆ రాష్ట్రానికే రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మరోవైపు, కర్ణాటక 6.62 బిలియన్ డాల‌ర్ల విదేశీ పెట్టుబడులను సంపాదించిన‌ట్లు తాజా గ‌ణంకాలు వెల్ల‌డించాయి.

    READ ALSO  Schools | అకడమిక్​ క్యాలెండర్​​ విడుదల.. పరీక్షలు, సెలవులు ఎప్పుడంటే..

    Foreign Direct Investment | ఏడో స్థానంలో తెలంగాణ‌..

    మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల త‌ర్వాతి స్థానాల్లో ఢిల్లీ(6 బిలియన్ డాల‌ర్లు), గుజరాత్ (5.71 బిలియన్ డాల‌ర్లు), తమిళనాడు (3.68 బిలియన్ డాల‌ర్లు), హర్యానా (3.14 బిలియన్ డాల‌ర్లు) నిలిచాయి. ఇక‌, 3 బిలియన్ డాల‌ర్ల విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ఆక‌ర్షించిన తెలంగాణ(Telangana) దేశంలో ఏడో స్థానం ద‌క్కించుకుంది.

    మహారాష్ట్ర, కర్ణాటకలలో అధిక పెట్టుబడులకు ప్రధాన కారణం అక్క‌డ మౌలిక సదుపాయాల మెరుగు ప‌డ‌డ‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్నేళ్లుగా ఈ రెండు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫ‌లితంగా ఇండియా(India)లో అత్య‌ధికంగా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఇన్‌ఫ్లోలు, తిరిగి పెట్టుబడి పెట్టిన ఆదాయాలు, ఇతర మూలధనంతో సహా మొత్తం FDI 14 శాతం పెరిగి 81.04 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంది. ఇది గత మూడేళ్లలో అత్యధికం. 2024లో 71.3 బిలియన్ డాల‌ర్ల ఎఫ్‌డీఐలు వ‌చ్చాయి.

    READ ALSO  Kaleshwaram | తెలంగాణ జీవ‌ధార కాళేశ్వ‌రం.. హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌

    Latest articles

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌స్ట్రాక్టర్లు Assistant Sub-Instructors (ASIs),...

    Charlapalli pond | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు సుందరీకరణకు అడుగులు.. హైడ్రా స‌హ‌కారం కోరిన‌ జైళ్ల విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలోని 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రీకరణకు...

    viral video | బలిచ్చే ముందు యజమానిని కౌగిలించుకుని ఏడ్చిన మేక..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: viral video : బక్రీద్(Bakrid) సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట social media...

    Group-1 Mains Results | ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదల

    అక్షరటుడే, అమరావతి: Group-1 Mains Results : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గత...

    More like this

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌స్ట్రాక్టర్లు Assistant Sub-Instructors (ASIs),...

    Charlapalli pond | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు సుందరీకరణకు అడుగులు.. హైడ్రా స‌హ‌కారం కోరిన‌ జైళ్ల విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Charlapalli pond : చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలోని 58 ఎక‌రాల చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రీకరణకు...

    viral video | బలిచ్చే ముందు యజమానిని కౌగిలించుకుని ఏడ్చిన మేక..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: viral video : బక్రీద్(Bakrid) సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట social media...