అక్షరటుడే, ఇందూరు: Government junior colleges | ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్లపై దృష్టి సారించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. బుధవారం డీఐఈవో కార్యాలయంలో (DIEO Office) ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండియర్ విద్యార్థుల తరగతిలు పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య 25 శాతం పెంచాలని సూచించారు. అధ్యాపకుల సమయపాలన, హాజరు, పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కళాశాలలో అవసరమైన మరమ్మతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ప్రయోగశాల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికగా అందజేయాలన్నారు.