అక్షరటుడే, వెబ్డెస్క్: Bhatti Vikramarka |నాన్ ట్యాక్స్ రెవెన్యూ (Non Tax Revenue)పై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్ టాక్స్ రెవెన్యూతో పాటు కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పథకాలను ఆపకుండా కొత్తగా రూ.33,600 కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతు భరోసా (Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.