అక్షరటుడే, వెబ్డెస్క్: Nagarjuna Sagar | ఎగువన వర్షాలు తగ్గడంతో కృష్ణమ్మ (Krishna River) శాంతించింది. దీంతో నాగార్జున సాగర్కు వరద తగ్గుముఖం పట్టించింది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కొన్ని రోజులుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. అయితే వర్షాలు తగ్గడంతో ప్రవాహం తగ్గింది. దీంతో నదిపై గల జూరాల, సుంకేసుల గేట్లను అధికారులు మూసి వేశారు.
Nagarjuna Sagar | శ్రీశైలం ప్రాజెక్ట్కు 57,851 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ఎగువన ప్రాజెక్ట్ గేట్లు మూసి వేయడంతో శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) వరద తగ్గింది. జూరాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్కు 57,851 ఇన్ఫ్లో వస్తోంది. జలాశయానికి ఇన్ఫ్లో తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్లోకి 66,745 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 227.29 టీఎంసీల నీరు ఉంది.
Nagarjuna Sagar | ఆ ప్రాజెక్ట్లు వెలవెల
కృష్ణానదిపై గల ప్రాజెక్ట్లు జలకళను సంతరించుకోగా.. గోదావరి, మంజీర నదులపై గల జలాశయాలు వెలవెలబోతున్నాయి. దిగువన కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతున్న ఎగువన ప్రవాహం లేక బోసిపోయింది. దీంతో తెలంగాణ(Telangana)లో సాగు నీటికి కీలకమైన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేరు ప్రాజెక్ట్లు, సింగూరు, నిజాం సాగర్ డ్యామ్లు ఇన్ఫ్లో లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్ట్ల కింద ఆయకట్టు ఉన్న రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు.