అక్షరటుడే, వెబ్డెస్క్ : Loans | వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఎంతో మంది బలవుతుంటారు. అలాగే ఫైనాన్స్ సంస్థలు(Finance companies) సైతం ప్రజలను రుణాల చెల్లించాలని వేధిస్తుంటాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రుణగ్రహీతల నుంచి బలవంతంగా అప్పులు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా బిల్లు రూపొందించింది. ఈ మేరకు శాసనభలో బిల్లు ప్రవేశపెట్టగా.. గవర్నర్ ఆమోదించారు.
ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు(Loans) వసూలు చేస్తున్నాయి. రుణేతర ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని పేర్కొంది. ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్ సర్కార్ తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వడ్డీ వ్యాపారులు (Moneylenders) ఆందోళన చెందుతున్నారు. అలాగే ఫైనాన్స్ సంస్థలు సైతం ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా బిల్లుతో మొండి బకాయిలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.