అక్షరటుడే, హైదరాబాద్: exams fail | తెలంగాణ telangana రాష్ట్రంలో మంగళవారం ఇంటర్ ఫలితాలు inter results వెలువడిన 24 గంటలు కూడా గడవక ముందే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
జీహెచ్ఎంసీ GHMC పరిధి హయత్ నగర్ Hayat Nagar, తట్టి అన్నారం, వైయస్సార్ కాలనీకి చెందిన అరుంధతి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ inter first year బైపీసీ చదువుతోంది. బొటనీ సబ్జెక్టులో ఫెయిల్ అయిందన్న మనస్థాపంతో ఇంట్లో ఉరేసుకుంది.
బంజారాహిల్స్ Banjara Hills రోడ్డు నంబరు – 2లోని ఇందిరానగర్ లో Indiranagar ఉంటున్న సుమతి, రామకృష్ణ దంపతుల కూతురు నిష్ట(16) కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది.
సనత్నగర్ sanath Nagar పరిధి అవంతినగర్ avantinagar తోటలో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి private employee సత్యనారాయణ కుమారుడు ప్రశాంత్ (17) ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లా Peddapalli district పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్నగర్ (జీడీనగర్) గ్రామానికి చెందిన సాపల్ల ఎల్లయ్య, గంగమ్మ దంపతుల కుమార్తె శశిరేఖ (17), భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి Baswapuram village చెందిన రాసాల మల్లేశ్, సునీత దంపతుల చిన్నకుమారుడు అఖిలేష్ యాదవ్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డారు.