ePaper
More
    HomeజాతీయంAir India Flight | ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

    Air India Flight | ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India Flight | ఎయిర్​ ఇండియా (Air India) విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) మంగళవారం చోటు చేసుకుంది. హాంకాంగ్​ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో ల్యాండ్​ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

    హాంకాంగ్​ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం ల్యాండ్​ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పార్కింగ్​ గేట్​ వద్దకు చేరుకున్న తర్వాత సహాయక విద్యుత్ యూనిట్​లో (APU) మంటలు చెలరేగాయి. ఇంజిన్లు ఆపేసిన తర్వాత విమానానికి ఏపీయూ నుంచి విద్యుత్​ సరఫరా అవుతుంది. ప్రయాణికులు విమానం నుంచి దిగే సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో విమానానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Air India Flight | వరుస ఘటనలతో ఆందోళన

    అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన (Ahmedabad Plane Crash) విషయం తెలిసిందే. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన బోయింగ్​ విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు.

    ఈ ప్రమాదం తర్వాత దేశంలో విమానాలకు సంబంధించి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ముంబైలో ల్యాండ్​ అవుతుండగా.. రన్​వేపై (Plane Skid on Runway) జారిపోయింది. ఈ ఘటనలో విమానం మూడు టైర్లు పగిలిపోగా.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

    సాంకేతిక సమస్యలతో విమానాలు రన్​వేపై నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing)​ చేస్తుండడంతో ఫ్లైట్​ ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ విమానం ఇంజిన్​లో సాంకేతిక సమస్య రావడంతో పైలట్​ పాన్​ కాల్​ ఇచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. ఇలాంటి ఘటనలతో విమాన ప్రయాణికులు భయపడుతున్నారు. విమానాలను ముందుగానే పూర్తిగా తనిఖీ చేసి ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.

    READ ALSO  PM Modi | రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

    Latest articles

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    More like this

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...